మిర్యాలగూడ, జనవరి 24: సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కార్యదర్శి టీ సాగర్ కోరారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో బుధవారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. రైతులు బోర్లు, బావుల కింద వరి చేశారని మంత్రికి తెలిపారు. అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.