న్యూఢిల్లీ: తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఈడీ తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. లిక్కరు కేసు ఒక కట్టుకథ అన్నారు. భారీ భద్రత నమడుమ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో అన్నారు.
మరోవైపు కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి, మోహిత్ రావు వాదనలు వినిపించనుండగా.. ఈడీ తరపున స్పెషల్ పీపీ ఎస్కే మట్టా, ఈడీ స్పెషల్ కౌన్సిల్ జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించనున్నారు. ఇక కవితకు మద్దతుగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కోర్టు కు వచ్చారు.
Bharat Rashtra Samithi (BRS) MLC K Kavitha appearing before Rouse Avenue Court in a Delhi excise policy-linked money laundering case says, “My arrest is illegal.”
Kavitha has been produced before the court of special judge MK Nagpal https://t.co/ApzLUaXo1z
— ANI (@ANI) March 16, 2024