పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కాకతీయ వాస్తు శిల్పకళకు అద్దం పడుతున్న సూర్యాపేట పట్టణంలోని రాపోలు గుళ్లను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, స్థపతి, కల్చరర్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ పథకంలో భాగంగా మంగళవారం ఆయన రాపోలు గుళ్లను పరిశీలించారు. గర్భాలయం, అర్ధమండపం, మహామండపం, విశాలమైన రంగపాలు, చుట్టూ ప్రదక్షిణ మండపంతో విలక్షణమైన వాస్తుతో నిర్మించిన ఆలయం చెత్తాచెదారంతో నిండిపోయిందని వాపోయారు. వెనుక భాగంలోని కప్పు, గోడరాళ్లు, రంగమండపం, చూరు, దూలాలు, వాయవ్య మూలతో రెండువరుసల స్తంభాలు, కూలిపోయాయని పేర్కొన్నారు. తక్షణమే పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే 700 ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయం కనుమరుగైపోతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆదివాసీ బిడ్డలకు పక్కాగా ఆరోగ్యలక్ష్మి
ట్రేడ్ లైసెన్స్ లేకుంటే 100% పెనాల్టీ