దినేష్కుమార్, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్, మురళీధర్గౌడ్, సుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్న కుటుంబ కథాచిత్రం ‘వెంకట్రామయ్యగారి తాలూకా’. సతీశ్ ఆవాల దర్శకుడు. కోమలి మహేందర్ తొట్టె, సోమేశ్ సారిపల్లి నిర్మాతలు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానున్నది.
కష్టపడి ఇష్టంతో నిర్మించిన సినిమా ఇదని నిర్మాత కోమలి మహేందర్ అన్నారు. తల్లిదండ్రుల గొప్పతనం తెలిపే విధంగా ఈ సినిమా కథ, కథనాలు సాగుతాయని, థియేటర్కి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇదని దర్శకుడు సతీశ్ ఆవాల తెలిపారు. కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: బి.అనిల్కుమార్, సంగీతం: చరణ్అర్జున్, నిర్మాణం: కోమలి క్రియేషన్స్.