హైదరాబాద్ : నమస్తే తెలంగాణ, ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలకు విశేష స్పందన లభించింది. ప్రథమ బహుమతికి స్ఫూర్తి కందివనం రాసిన డిమ్కీ కథ ఎంపికైంది. ద్వితీయ బహుమతికి చందు తులసి రాసిన మోదుగు పువ్వు, నస్రీన్ ఖాన్ రాసిన దిశ మార్చుకున్న గాలి ఎంపికయ్యాయి. తృతీయ బహుమతులకు నెల్లుట్ల రమాదేవి రాసిన పొద్దు గుంకక ముందే, వేణు మరీదు రాసిన కాటుక కన్నుల సాక్షిగా, ప్రభాకర్ జైనీ రాసిన బోనగిరి టు లష్కర్ కథలు ఎంపికయ్యాయి. ప్రథమ బహుమతి కింద రూ. 50 వేలు, ద్వితీయ బహుమతి కింద రూ. 25 వేలు, తృతీయ బహుమతి కింద రూ. 10 వేల చొప్పున నగదు అందజేయనున్నారు.