హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్ ములగాని ఉదయ్కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని ఉదయ్కృష్ణారెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు తిరసరించింది. అత్తాపూర్ పోలీసుస్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్ను జస్టిస్ జే శ్రీనివాసరావు విచారించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఆరోపణలను పోలీసులు కనీస స్థాయిలో కూడా ధ్రువీకరించకుండా కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే ఈ దశలో మధ్యంతర రక్షణ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. ముందుగా పోలీసుల నుంచి పూర్తి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేరొంటూ వారికి నోటీసులు జారీచేసింది. కేసును 27కు వాయిదా వేసింది.