హన్మకొండ: హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం అంబాల గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ మేరకు మండల ఇంచార్జి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో ప్రకటించారు. రానున్న ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని ప్రకటించారు.