కందుకూరు, డిసెంబర్ 18: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, లేకుంటే బీజేపీ మోసాన్ని ఎండగడతామని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. సోమవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బహిరంగ సభ నిర్వహించి మాదిగల సత్తా చాటుతామని చెప్పారు.
ఆదివారం ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరులో విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వెంటనే వర్గీకరణ బిల్లు పెడుతామన్న బీజేపీ..8 ఏండ్లుగా కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా బిల్లు ప్రవేశపెట్టకపోతే ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నగాల్ల యాదగిరి, చందు, వెంకటేశ్, నర్సింహ, కంద పెద్ద నర్సింహ పాల్గొన్నారు.