ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ బుధవారం ట్విట్టర్లో షేర్ చేసి గ్రామస్థులను అభినందించారు.
అంకితభావంతో పనిచేస్తూ.. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతోపాటు పచ్చని స్వర్గధామంగా మార్చిన సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, గ్రామస్థులు నిజమైన పర్యావరణ హీరోలని కొనియాడారు. నాడు ఎడారిగా ఉన్న గ్రామంలో లక్ష మొక్కలు నాటి బతికించి పర్యావరణాన్ని పెంచిపోషించిన విషయాన్ని ట్విట్టర్లో పంచుకోవడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. ముక్రా(కే) గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ కలలుగన్న హరిత తెలంగాణ కోసం పాటుపడాలని ట్వీట్ చేశారు.
-ఇచ్చోడ