హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తేతెలంగాణ): ఏపీ ఫైబర్నెట్ లైసెన్స్ను రద్దుచేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు లేఖ రాశారు. ఏపీలో ఫైబర్నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎంఎస్వో లైసెన్స్ ఉపయోగిస్తున్నదని పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997కు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏపీ ఫైబర్నెట్ను అనర్హత జాబితాలో చేర్చాలని మంత్రిని కోరారు.