హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఎంపీ నామనాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు సోమవారం ప్రధానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఎన్టీఆర్కు భారతరత్న ప్రదానం చేయటమే మనం ఆయనకు అందించే సముచిత నివాళి అని తెలిపారు.
భారతీయ సినిమా రంగంతో పాటు దేశంలోని సామాజిక-రాజకీయరంగాల్లో విశిష్ట సేవలందించిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని వెల్లడించారు. 15వ లోక్సభలో పార్లమెంట్హౌస్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపనలో తానే ప్రత్యేక చొరవ తీసుకున్నానని గుర్తు చేశారు. ఎన్టీఆర్కు భారతరత్నను ప్రదానం చేయటం ద్వారా దేశానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని లేఖలో నామా పేరొన్నారు.