వనపర్తి : జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం లారీని ఢీ కొట్టిన సంఘటనలో కారు డ్రైవర్ మహేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, గాయపడిన నాగ లక్ష్మమ్మ అనే మహిళను వనపర్తి ఏరియా దవాఖనకు తరలిస్తుండగా మృతి చెందింది. అందులో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖనకు తరలించినట్టు ఎస్ఐ నాగ శేఖర్ రెడ్డి తెలిపారు. మృతులు కడప జిల్లా వాసులుగా తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్
తాండూరులో కొవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించిన మంత్రి
తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాతి : మంత్రి సత్యవతి రాథోడ్