వికారాబాద్ : సీఎం కేసీఆర్ కొవిడ్ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాండూరులో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన కొవిడ్ కేర్ సెంటర్ను మంత్రి పరిశీలించారు. దవాఖానలో ఏర్పాట్లు, కొవిడ్ రోగులు అందిస్తున్న చికిత్సపై అధికారులు, వైద్యులతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొవిడ్ కేర్ సెంటర్లో 18 మంది డాక్టర్లు, 12 మంది నర్సులు 3 షిఫ్ట్ లలో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. జిల్లాలో ఇంటింటి జ్వరం సర్వే దాదాపు పూర్తయిందన్నారు. ఇందులో కేవలం 6,500 మంది వరకు మాత్రమే కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు.
వారికి వైద్య సిబ్బంది మందులు పంపిణీ, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి తెలిపారు. జిల్లాలో మొదటి డోసు వాక్సిన్ వేసుకున్న 45 వేల మందికి రెండో డోసు ప్రక్రియ పూర్తి అయిన అనంతరం మళ్లీ మొదటి డోసు కార్యక్రమం చేపడుతామన్నారు.
జిల్లాలో కొవిడ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 18005996863 కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని మంత్రి సూచించారు. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్, కలెక్టర్ పౌసమి బసు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్
చరిత్ర సృష్టించిన హామిల్టన్.. ఈ ఘనత సాధించిన తొలి ఎఫ్1 డ్రైవర్
పాకిస్థాన్లో తొలి హిందూ మహిళా కలెక్టర్!