పెద్దపల్లి : అడ్డాల నాడు బిడ్డలు అవుతారు కాని గడ్డాలను కాదు అనే సామెతను ఓ ప్రభుద్ధుడు నిజం చేస్తున్నాడు. నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే పట్టించుకున్న పాపానపోలేదు. అమ్మ చనుబాలతో పెరిగి పెద్ద అయిన విషయాన్ని మర్చిపోయి ఆ మాతృమూర్తి పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నడు. ఆదుకునేందుకు ముందుకొస్తున్న వారిపట్ల అమానవీయంగా ప్రవరిస్తున్నడు.
సోదరుడి ప్రవర్తనతో విసుగు చెందిన సోదరి లక్ష్మి తన తల్లికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. ప్రపంచం అంతా మాతృ దినోత్సవ వేడుకలు జరుకుంటుంటే ఆ కూతరు మాత్రం తన తల్లి ఆరోగ్యం కోసం పోరాడుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో మంథని మున్సిపల్ పరిధి బోయిన్ పేట గ్రామంలో లక్ష్మి అనే మహిళ తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నది.
తల్లికి తన సోదరుడు చికిత్స చేయించడం లేదని లక్ష్మి మంథని అంబేద్కర్ చౌరస్తాలో తన తల్లిని కాపాడాలని రోడ్డుపై బైఠాయించింది. తన తల్లిదండ్రుల పేరున బ్యాంకులో డబ్బులు ఉన్నా కూడా తన సోదరుడు చికిత్స చేయించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
అంతే కాకుండా మేము చికిత్స చేయించడం కోసం వెళ్తే మా పై దాడి చేశాడని తెలిపింది. ఇప్పటికైనా తన తల్లికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని వేడుకుంటున్నది.
ఇవి కూడా చదవండి..
మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్
తాండూరులో కొవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించిన మంత్రి
పాకిస్థాన్లో తొలి హిందూ మహిళా కలెక్టర్!