హైదరాబాద్: సెప్టెంబర్ 17 సందర్భంగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినమేనని, ఈ విషయంలో ఎలాంటి వివాదం అవసరం లేదని స్పష్టం చేశారు. 1947, ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం సిద్ధించలేదని, ఏడాది తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. అందువల్ల ఇవాళ మన స్వాతంత్య్రం సంపూర్ణమయిందని చెప్పారు. సెప్టెంబర్ 17పై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు బోడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవంపై ప్రతిపక్షాలు రాద్దాంతం ఎందుకు మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, జయశంకర్ విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలన ఇప్పుడు యావత్ భారతదేశానికి రోల్ మోడల్గా మారిందన్నారు. గులాబీ జెండాయె ఇప్పుడు తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.