CM KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లిన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్.. తమ చిన్ననాటి మధురస్మృతులను నెమరువేసుకున్నారు. దాదాపు 30 ఏండ్ల క్రితం పెద్దనాన్న కేసీఆర్, సోదరి కల్వకుంట్ల కవిత, పెద్దమ్మ శోభ, తల్లిదండ్రులు రవీందర్రావు, శశికళతో కలిసి కొండగట్టుపై దిగిన ఫొటోలను ఆయన బుధవారం ట్విటర్లో పోస్టు చేశారు. ‘ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిలో ఇప్పుడు కొండగట్టు వంతు వచ్చింది.
కొండగట్టు అంజన్నను సీఎం కేసీఆర్ గారు కుటుంబసభ్యులతో కలిసి అనేకసార్లు దర్శించుకున్నారు. కొండగట్టు వ్యూ పాయింట్ నుంచి అప్పటి అపురూప చిత్రా లు..’ అంటూ కుటుంబంతో కలిసి దిగిన పాత ఫొటోలు పోస్టు చేశారు. ఈ పోస్టుకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఇప్పటికే పోస్టు ను దాదాపు 36 వేల మందికిపైగా వీక్షించారు. ‘కారణజన్ముడు కేసీఆర్’, ‘పాత చిత్రాలు ఎప్పుడూ ఓ నిధి వంటివి. అవి మనల్ని మధురమైన బాల్యంలోకి తీసుకెళ్తాయి’, ‘ఆహ్లాదకరమై, మనోహరమైన జ్ఞాపకాలు’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.