Thorrur Municipality | తొర్రూర్ మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీయిజం ప్రదర్శించింది. తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్న బస్సుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు దాడికి దిగారు.
జనగామ మండలం పెంబర్తి బైపాస్ వద్ద ఎర్రబెల్లి వెళ్తున్న బస్సును అడ్డుకున్నారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ఎంపీ, అతని అనుచరులు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండాయిజాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక నేరుగా.. జనగామ మున్సిపల్ కార్యాలయం ఆవరణలోకి వెళ్లిపోయారు. ఆయన వెంట అనుచరులు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ ఒక్కరే లోనికి వెళ్లారు.