వరంగల్: వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ (Sudheer Kumar) అన్నారు. బీజేపీ, కాంగ్రెస్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. తాను స్థానికుడినని, తన బర్త్ సర్టిఫికేట్ తనకు ఇక్కడే దొరుకుతుందని, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు స్థానిక సర్టిఫికెట్ ఇక్కడ దొరకదన్నారు. తనపై భూకబ్జా ఆరోపణ లేవని, అలాంటివి భవిష్యత్లో కూడా చేయని స్పష్టం చేశారు. వరంగల్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరంగల్కు ఎయిర్పోర్టు ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందన్నారు. ఎయిర్పోర్టు వస్తే వరంగల్ ముఖచిత్రమే మారిపోతుందని చెప్పారు. అజంజాహి మిల్లును కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసిందని విమర్శించారు.
వరంగల్లో అనేక సహజ వనరులు ఉన్నా.. ఎగుమతి కావట్లేవని చెప్పారు. సింగరేణి బొగ్గుకు అధిక ధర రావడం లేదని, ఇక్కడ పండే వరి, మిర్చి పంటలకు ధర రాక రైతులు నష్టంపోతున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్లకు దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, బీఆర్ఎస్కు మాత్రం ఒకే రాష్ట్రం.. ఒకే అజెండా అని స్పష్టం చేశారు. పదేండ్లలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. పార్లమెంట్లో బీజేపీని నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పదేండ్లలో యావత్ తెలంగాణను బీజేపీ మోసీ చేసిందన్నారు. బీఆర్ఎస్ను గిలిపిస్తే ప్రతిపక్ష పాత్ర పోషించి నిధులు తీసుకొస్తాని చెప్పారు. సంకిర్ణ ప్రభుత్వం వస్తే కారు పార్టీదేపై చేయిగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని బలిపశువు చేయాలి అనుకొని వల్లే బలయ్యారని విమర్శించారు. కొత్త జిల్లాలను రద్దు చేయాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు.