హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రజల కీడును ఆశించే కాంగ్రెస్ పార్టీకి కీలెరిగి వాత పెట్టాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ హెచ్చరించారు. ఢిల్లీలోని తెలంగాణభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వారం రోజులుగా వానలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ ముట్టడికి దిగడాన్ని ఖండించారు. వరదల్లో ప్రజలు అవస్థలు పడుతుంటే.. కాంగ్రెస్ బురద రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు అండగా నిలిస్తే, కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని తెలిపారు.