హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీ) కోసం కేంద్రం తీసుకున్న చర్యలేంటని టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఈవీల వినియోగం పెంచాలని కేంద్రానికి ఎంపీ సూచించారు. దీనికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖమంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ స్పందిస్తూ.. తాము ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఎఫ్ఏఎంఈ) కింద ఈవీల పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాధానం ఇచ్చారు. ఇప్పటికే రూ.10వేల కోట్లు విడుదల చేశామన్నారు. అదేవిధంగా ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద రూ.25,938 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.