Breaking | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మందలపల్లి దగ్గర బైక్పై వెళ్తుండగా వారిని గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. తండ్రికి తీవ్రగాయాలయ్యాయి.
ఏపీలోని కృష్ణా జిల్లాలోని ఏ కొండూరు మండలం చీమలపాడుకు చెందిన బాలకృష్ణ- లక్ష్మీ (30) దంపతులు. వారికి శరణ్య (8), షణ్మిత శ్రీ (6) కుమార్తెలు. భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి బాలకృష్ణ మోటార్ సైకిల్పై అశ్వారావుపేట వైపునకు వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న బైక్.. మందలపల్లి క్రాస్ రోడ్డు దాటిన తర్వాత జాతీయ రహదారిపై ప్రభు నర్సరీ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఆ వెంటనే ఓ లారీ వీరి పై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో గాయపడిన బాలకృష్ణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణమైన కారు, లారీని స్వాధీనం చేసుకున్నారు.