సూర్యాపేట : ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి బైక్(Bike) ఢీ కొట్టిన ప్రమాదంలో(Road accident) తల్లీ, కొడుకు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట(Suryapet) జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెర్వు మండలం కందిబండ గ్రామానికి చెందిన తమ్మారపు వెంకటనర్సయ్య (24), తల్లి రాంబాయమ్మ(45)తో కలిసి సూర్యాపేటలో శుభకార్యానికి బైక్పై వెళ్లాడు.
తిరిగి వస్తుండగా మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకటనర్సయ్య, రాంబాయమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న సీఐ రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, వెంకటనర్సయ్య భార్య ఏడు నెలల గర్భవతి అని తెలిసింది.