రాంనగర్, మే 23 : కరీంనగర్ జిల్లాలో(Karimnagar) విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) తల్లీకూతుళ్లు(Mother and daughter died) మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన విద్యాధర్ బిందానికి ఇద్దరు భార్యలు ఉన్నారు.
మొదటి భార్య చింతకుంటలోని ఇటుక బట్టీలోనే ఉంటూ అక్కడే ఆమె కూతురు బాబీ బిందాని(18), కొడుకు దశరథ్ బిందానితో కలిసి ఉంటున్నది. విద్యాధర్ చిన్న భార్యతో కలిసి వేరే ఇంట్లో ఉంటూ వేరే ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. కాగా, బుధవారం రాత్రి పనులకు వెళ్లి వచ్చిన బేని బిందాని ఇంట్లో నిద్రించగా ఉదయమే సమీపంలో ఉండే జగన్నాథ్ అనే వ్యక్తి పనికి పోయేందుకు నిద్రలేపేందుకు వెళ్లాడు. తలుపు తట్టడంతో విద్యుత్ షాక్ రాగా వెంటనే కేకలు వేసి విద్యాధర్కు సమాచారం ఇచ్చాడు.
అకడికి చేరుకున్న విద్యాధర్ కరెంటు వైర్లు తొలగించి లోనికి వెళ్లి చూడగా అతని పెద్ద భార్య బేని బిందాని, కూతురు బాబి బిందాని విద్యుత్ షాక్తో మృతిచెంది ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు అకడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కరీంనగర్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి తెలిపారు.