స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉన్నది. విశాఖ స్టీల్ను పూర్తిగా ప్రైవేటుపరం చేసేముందు దాన్ని నష్టాలపాలు చేస్తున్నది. వాటిని సాకుగా చూపి రూ.లక్షల కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేలా కేంద్రం పెద్దలు కుట్ర పన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడాలన్న చిత్తశుద్ధి మాకు ఉన్నది. కేంద్రం కుట్రను ఎదిరించి కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వారితో కలిసి పని చేస్తాం.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు విమర్శించారు. ప్లాంట్ను ప్రైవేటుపరం చేసే కుట్రలను అకడి కార్మికులు, ఇతర సంఘాలు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వంటి పార్టీలు ఎప్పటికప్పుడు అడ్డుకొంటున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని ఆరోపించారు. వరింగ్ క్యాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ కేటీఆర్ ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు.
ప్రైవేటీకరణ వెనుక భారీ కుట్ర
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. బీజేపీ తన ఎజెండా అమలు కోసమే స్టీల్ ప్లాంట్ను క్రమంగా చంపే ప్రయత్నం చేస్తున్నదని లేఖలో ఆరోపించారు. ఒకవైపు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరిట గతిశక్తి వంటి కార్యక్రమాలతో ముడిపెట్టి కేంద్రం గొప్పలు చెప్పుకొంటూ, మరోవైపు మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. ‘ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున సిమెంట్ను ఉత్పత్తి చేసిన కంపెనీలన్నింటినీ కేంద్రంలోని ప్రభుత్వాలు ప్రైవేటుపరం చేశాయి. ప్రస్తుతం స్టీల్ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే విశాఖ స్టీల్ను పూర్తిగా ప్రైవేటుపరం చేసేముందు దాన్ని నష్టాలపాలు చేస్తున్నది.
ఆ నష్టాలను సాకుగా చూపి రూ. లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రైవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం పెద్దలు కుట్ర పన్నారు. స్టీల్ ప్లాంట్కు అవసరమైన ప్రత్యేక ఐరన్ ఓర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డింది. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60% వరకు పూర్తిగా ముడి సరుకుపైనే ఖర్చు చేయా ల్సి వస్తున్నది. మరోవైపు ప్రైవేట్ కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా ఐరన్ ఓర్, బొగ్గు, ఇతర గనులను కేటాయించడం వల్ల వారి ఉత్పత్తిలో ముడి సరుకుల ఖర్చు 40% లోపలనే ఉంటున్నది. దీంతో మారెట్లో ప్రైవేట్ కంపెనీలతో వైజాగ్ స్టీల్ పోటీపడలేకపోతున్నది. వైజాగ్ స్టీల్ను అంతిమంగా నష్టాల్లోకి నెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది. కోకింగ్ కోల్ను పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి రావటం. స్టీల్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకును సైతం ఎన్ఎండీసీ నుంచి మారెట్ ధరకు కొనుగోలు చేయాల్సి రావడం వలన వైజాగ్ స్టీల్ తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నది. దీంతో ఏడాది కాలంగా సగానికి పైగా ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చింది. ఇదంతా ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టి, ప్రైవేట్ పరం చేసేందుకే. నష్టాలను సాకుగా చూపించి తన కార్పొరేట్ మిత్రులకు రూ.12.5 లక్షల కోట్లను రద్దు చేసిన ప్రధానమంత్రి మోదీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు లేదు’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
సెయిల్లో కలుపొచ్చుగా?
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 7.3 ఎంటీపీఏ కెపాసిటీ ఉన్నా, కేంద్రం ముడి సరుకును, మూలధనాన్ని ఇవ్వకపోవడంతో పూర్తిస్థాయి కెపాసిటీతో పనిచేయలేకపోతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 50 శాతం కెపాసిటీకి కూడా 100 శాతం కెపాసిటీ ఉత్పత్తికి అయ్యే ఖర్చే అవుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తే 100 శాతం కెపాసిటీతో పని చేయడం వల్ల అనేక ఖర్చులు తగ్గి ప్లాంట్ లాభాల బాట పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా వైజాగ్ స్టీల్ను వరింగ్ క్యాపిటల్ పేరుతో ప్రైవేట్ కంపెనీలతో కలిపే ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. దీనికి బదులు కేంద్ర ప్రభుత్వమే అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా ప్లాంట్ను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) దాదాపు రూ.లక్ష కోట్లతో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించిందని, ఈ సంస్థలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కలపవచ్చని సూచించారు. తకువ ధరకు ప్రైవేట్ సంస్థలకు అమ్మడం కంటే కేంద్ర ప్రభుత్వమే ఇంకో ప్రభుత్వరంగ సంస్థతో కలపడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. సెయిల్ విస్తరణ లక్ష్యానికి కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. సెయిల్ సంస్థ ఈ దిశగా ముందుకొస్తే తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్న బయ్యారం స్టీల్ ప్లాంట్తోపాటు కడపలోనూ మరో ఉకు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎకో సిస్టం ఏర్పడుతుందని తెలిపారు. పైగా దేశ మౌలిక రంగానికి అవసరమైన స్టీల్ సరఫరా భద్రత కోసం ప్రైవేట్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునేందుకు కలిసిరావాలి
ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా అమ్మివేయడమే ఏకైక ఎజెండాగా పెట్టుకొన్నదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి జాతికి తీరని నష్టం కలిగించిందని ధ్వజమెత్తారు. ‘ఒకప్పుడు దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వరంగ సంస్థలను, నష్టాలు సాకుగా చూపించి ప్రైవేట్ పరం చేస్తున్న మోదీ, ప్రస్తుతం లాభాలతో నడుస్తున్న నవరత్నాల్లాంటి కంపెనీలను కూడా అమ్మేసే కుట్రలకు తెగబడుతున్నారు. లాభాలను ప్రవేట్పరం చేస్తూ, నష్టాలను జాతీయం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనం చేస్తూ దేశానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో బీజేపీ స్పష్టం చేయాలి. బీఆర్ఎస్ పార్టీగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడాలన్న చిత్తశుద్ధి మాకు ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా తమ అనుకూల ప్రైవేట్ కంపెనీకి వైజాగ్ స్టీల్ను అప్పజెప్పాలని కుట్ర చేస్తున్నది. దీన్ని ఎదిరించి ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వారితో కలిసి పని చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.
ఇందుకోసం కలిసి వచ్చే ప్రజాసంఘాలు, పార్టీలతో కలసి ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హకు. దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగువారందరు కలిసి రావడం అవసరం. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో ఏర్పాటైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొన్ని స్వార్థ శక్తులు, వారి ఎజెండాలకు బలి కావొద్దు. ఎట్టిపరిస్థితుల్లో దాన్ని అంగీకరించబోం. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణతోనే కేంద్రం కుట్రలు ఆగవు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, సింగరేణి వంటి సంస్థలు కూడా అంతిమంగా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి పోయేలా కేంద్రం కుట్రలు చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, లక్షలమంది కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడేందుకు కార్మికులంతా మాతో కలిసిరండి’ అని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కుట్రను ఎదురొనేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్కు కేటీఆర్ సూచించారు.
కేంద్రం రూ.ఐదు వేల కోట్లు ఇవ్వాలి
దాదాపు రూ.లక్షన్నర కోట్ల ఆస్తులున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం దాదాపు రూ.25 వేల కోట్ల వరకు మాత్రమే రుణాల మానిటైజేషన్ చేసుకోవడానికి కేంద్రం అవకాశం కల్పించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అదే స్థాయిలో ఆస్తులు లేదా విలువ కలిగిన ప్రైవేట్ కంపెనీలకు మాత్రం దాదాపు రూ.70 నుంచి రూ.80 వేల కోట్ల వరకు రుణాలను పొందగలిగే సౌకర్యాన్ని కల్పించిందని దుయ్యబట్టారు. ‘ప్రైవేటు కంపెనీలతో సమానంగా రుణ సౌకర్యం కల్పించి, బ్యాంకుల ద్వారా మరింత మూలధనాన్ని ఇప్పిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన కార్యకలాపాలను ప్రైవేటు కంపెనీలతో సమానంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుంది. కేంద్రం వెంటనే ఈ దిశగా చొరవ చూపాలి. తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అవసరమైన మేరకు కనీసం రూ.5 వేల కోట్లు కేటాయించాలి. గతంలో ప్రధాన మంత్రులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయ్ హయాంలో ఇదేవిధంగా వైజాగ్ స్టీల్కు నిధులు నేరుగా కేటాయించారు.
ప్రస్తుతం వైజాగ్ స్టీల్ కోరుతున్నట్టు సుమారు రూ.5 వేల కోట్లు కేటాయించి, అందుకు సరిపడా ఈక్విటీని కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. 2003లో వాజ్పేయ్ ప్రభుత్వం ఇచ్చిన నగదును 2008లో తిరిగి వడ్డీతోసహా వైజాగ్ స్టీల్ ప్లాంట్ చెల్లించింది. ప్రస్తుతం మూలధనం అందించి స్టీల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే పేరుతో జారీచేసిన ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ (ఈవోఐ)ను వెంటనే రద్దు చేయాలి. దీనికి బదులుగా కేంద్రమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి నేరుగా స్టీల్ను కొనుగోలు చేయాలి. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ సొమ్ములను అందించి, స్టీల్ కోనుగోలు చేస్తే సరిపోతుంది. ఇవేవీ కాకుండా ప్రైవేట్ కంపెనీలను వైజాగ్ స్టీల్లోకి ప్రవేశపెట్టాలన్న దురుద్దేశంతో ఈవోఐ నోటిఫికేషన్ ఇచ్చారని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇందులో ఏర్పాటు చేసుకోబోయే ఒప్పందం తాలుకు నిర్దిష్ట నిబంధనలు సైతం పేర్కొనలేదు. దీన్నిబట్టే ఇది కేవలం ఇటీవల భారీగా తన సంపద కోల్పోయి, ప్రపంచ ఆర్థిక కుబేరుడి జాబితాలో స్థానం పడిపోయిన తమ మిత్రుని కంపెనీతో తగినవిధంగా ఒప్పందం చేసుకొనేందుకు వీలు కల్పిస్తున్నట్టు స్పష్టమవుతున్నది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.