హైదరాబాద్, డిసెంబర్ 15 (నమ స్తే తెలంగాణ): నాబార్డ్ ఉద్యోగులకు కేంద్రం ధోకా ఇచ్చింది. వేతనాలపై గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. దీంతో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం నాబా ర్డ్ ఉద్యోగులు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు. 1982లో రిజర్వ్బ్యాంక్ నుంచి వేరుచేసి నాబార్డ్ను ఏర్పాటు చేశారు.
నాబార్డ్ ఉద్యోగులకు రిజర్వ్బ్యాంక్లోని ఉద్యోగుల మాదిరిగానే వేతనాల సవరణతో పాటు ఇతర అలవెన్స్లు ఇచ్చేందుకు నాటి ప్రభు త్వం హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఆ హామీని కేంద్రంలోని బీజేపీ సర్కారు నీరుగారుస్తున్నదని ఉద్యోగులు మండిపడుతున్నారు.