హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఓటు వేసే ముందు ‘జై బజరంగ్ బలి’ అంటూ నినాదాలు చేయాలని కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునివ్వడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. లౌకిక రాజ్యాంగంపై ప్రమా ణం చేసి, దానినే ఉల్లంఘించడం సరికాదని పేర్కొ న్నారు.
ప్రధాని రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించాలే తప్ప, ఓట్ల కోసం రాజ్యాంగ విలువలను కాలరాయొద్దని హితవు పలికారు. ప్రధాని వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ , చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.