కృష్ణకాలనీ, ఫిబ్రవరి 25 : భూపాలపల్లిలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు చేదు అనుభవం ఎదురైంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని చెప్పి.. ఎనిమిదిన్నర ఏండ్లుగా బీజేపీ ప్రభుత్వం మాదిగలను మో సం చేస్తున్నదని, బిల్లు విషయమై స్పష్టత ఇ చ్చాకే మాట్లాడాలంటూ ఎమ్మార్పీఎస్ నేతలు ఎమ్మెల్యే ఈటల ప్రసంగాన్ని అడ్డుకొన్నారు.
శనివారం సాయంత్రం బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజాగోస-బీజేపీ భరోసా’ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో కొంతమంది ఎమ్మార్పీఎస్ నాయకులు వచ్చి జెండాలతో నిరసన తెలిపారు. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా లేచి ఎమ్మార్పీఎస్ నాయకులపై దాడికి యత్నించారు.