MLC Vanidevi | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ఇన్నేండ్లు గుర్తుకు రాని పీవీ నరింహారావు ఇప్పుడే గుర్తొచ్చారా..? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవీ ఫైర్ అయ్యారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులకు పీవీ గుర్తుకు వస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
పీవీ నర్సింహారావు ఒక శక్తి. మైనార్టీలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకొని, ఒక సంస్కరణ దిశగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత పీవీ నర్సింహారావుది అని కొనియాడారు. చివరి శ్వాస వరకు కూడా పీవీ నర్సింహారావు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. మరణానంతరం ఆయనపై ప్రపంచ దేశాలు సానుభూతి చూపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనను పట్టించుకోలేదన్నారు. కళ్ళుండి చూడలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పీవీ నరసింహారావుకు న్యాయం చేశారు. కేసీఆర్ ఉద్యమం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కేసీఆర్ సుస్థిర పాలన, అభివృద్ది చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఎవరెవరో వస్తుంటారు. వారి మాటలు నమ్మవద్దని ప్రజలను పీవీ కూతురు వాణిదేవీ కోరారు.