ఖమ్మం సిటీ, మే 20: పాలన, అభివృద్ధి, సంక్షేమం సహా అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. రెండున్నరేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమాగా చెప్పారు. ఖమ్మం, మధిర, ఇల్లెందు, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చేపట్టబోయే డిజిటల్ సభ్యత్వ నమోదు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కార్యకర్తల భాగస్వామ్యం, జిల్లా లో రాజకీయ పరిస్థితుల గురించి.. ఖ మ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయం బుధవారం చర్చించారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు.
కేసీఆర్ను సీఎం చేద్దాం: పువ్వాడ
కేసీఆర్ను మళ్లీ సీఎం చేయడమే అందరి లక్ష్యమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. ఉమ్మడి జి ల్లాలో పది అసెంబ్లీ స్థానాలూ కైవసం చే సుకునేదాకా విశ్రమించేది లేదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ ఏకమయ్యాయి: వద్దిరాజు
తెలంగాణలో బీఆర్ఎస్ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ఏకమయ్యాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజాబలం దండిగా ఉన్న బీఆర్ఎస్ను ఏమీ చేయలేవని తేల్చిచెప్పారు.
కేసీఆర్ పథకాలే బీఆర్ఎస్ బలం: నామా
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ బలమని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రతీ అ సెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సభ్యత్వ న మోదు ప్రక్రియను శ్రేణులు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.