హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): సాగుకు పెట్టుబడి క ష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకం రైతుల్లో భరోసా నింపిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ప్రారంభించి ఐదేండ్లు పూర్తవ్వడంపై పల్లా హర్షం వ్యక్తంచేశారు. రైతుబం ధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. ఈ పథకాన్ని అమలు చేసిన సీఎం కేసీఆర్కు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సంకల్పంతో రైతుబంధు ద్వారా పంట పెట్టుబడిని అందించారని కొనియాడారు. ఇప్పటి వరకు రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం రైతులపై బీఆర్ఎస్ ప్ర భుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనమ ని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావితం చేసే పథకాల్లో రైతుబం ధు పథకాన్ని యూఎన్వో గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిని హరితవిప్లవ పితామహుడు స్వామినాథన్ మెచ్చుకున్నారని పేర్కొన్నారు.