MLC Naveen Kumar | హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న, చేస్తున్న ప్రచారం అవాస్తవం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ స్పష్టం చేశారు. తనకు ఫోన్ ట్యాపింగ్తో ఎలాంటి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తన గెస్ట్ హౌస్లో ఎలాంటి తనిఖీలు జరగలేదు. సోషల్ మీడియాలో వస్తున్నది తప్పు. తన గెస్ట్ హౌస్లో, ఇంట్లో ఎలాంటి పోలీసు తనిఖీలు జరగలేదు. కుట్రపూరితంగా తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. తప్పుడు కథనాలు రాసినవారిపై లీగల్గా కోర్టులో కేసు వేస్తాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని నవీన్ కుమార్ తెలిపారు.