హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్లో ఏర్పాటుచేశారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కవితతో కలిసి ఎంపీ కే కేశవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటన్నారు. దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలని తెలిపారు. నిరుద్యోగం, మతత్వాన్ని సమూలంగా దేశం నుంచి రూపుమాపాలని వెల్లడించారు. ప్రపంచానికి దిక్సూచిలా భారతదేశం ఎదగాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, గజ్జెల నగేష్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, విప్లవ్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు.