వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా? అని అనిపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే విధానం ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంపై రైతుల పక్షాన సీఎం కేసీఆర్ స్పష్టంగా డిమాండ్ చేశారని ఆమె చెప్పారు.
పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి..వేరే రాష్ట్రాలకు మరో నీతి ఉండకూదని కవిత పేర్కొన్నారు. పంజాబ్లో కొనుగోలు చేసినట్లే తెలంగాణలోనూ వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరారు. వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని వెంటనే రూపొందించాలని కవిత డిమాండ్ చేశారు.
వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుంది.
ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలని నిన్న కేసీఅర్ గారు రైతుల పక్షాన స్పష్టంగా డిమాండ్ చేశారు.— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2022
పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదు. కేంద్రం పంజాబ్లో వడ్లు 100%
కొనుగోలు చేసినట్టే, తెలంగాణలోనూ కొనుగోలు చేయాలి..
We Demand One Nation One Procurement Policy.#KCRWithFarmers#RaithuBandhuKCR— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2022