MLC Kavitha | యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రోద్భలంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడడం దుర్మార్గమని స్పష్టం చేశారు. భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరని తేల్చిచెప్పారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
రాహుల్ గాంధీ వల్లించే మొహబ్బత్ కి దుకాన్ ఒక బూటకమని తేటతెల్లమైందని, అది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణమని ధ్వజమెత్తారు. ఇలాంటి హింసా రాజకీయాలను తెలంగాణ తిరస్కరిస్తుందని, హింసకు, విధ్వంసకర చర్యలకు తెలంగాణలో తావు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన యువజన విభాగాన్ని గూండాల విభాగంగా తీర్చిదిద్దుతోందని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ జరిపిన దాడి వారి అసలు రంగును బట్టబయలు చేసిందని, కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిదర్శనమని చెప్పారు. ఇలాంటి సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్దిచెబుతారని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ సాగర్ చూసేందుకు వచ్చారు. అక్కడ చాలాసేపు సరదాగా గడుపుతూ వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా వారంతా డ్యామ్లో పడి గల్లంతయ్యారు. వాళ్లందరూ డ్యామ్లో పడి గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే ఐదుగురు యువకులు మరణించారు. మిగిలిన ఇద్దరిని సురక్షితంగా కాపాడగలిగారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం ఏడుగురు దిగగా మునిగి ఐదుగురు యువకుల మృతి
హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం
మొత్తం ఏడుగురు గల్లంతు కాగా బయటపడ్డ ఇద్దరు
కొండపోచమ్మ రిజర్వాయర్లో చనిపోయిన ఐదుగురు యువకుల వివరాలు
1. దనుష్ s/o నర్సింగ్,… pic.twitter.com/5x2XfXie7U
— Telugu Scribe (@TeluguScribe) January 11, 2025
మృతులను ధనుష్ (20), లోహిత్(17), చీకట్ల దినేశ్వర్ (17), సాహిల్ (19), జతిన్ (17)గా గుర్తించారు. బతికి బయటపడ్డ వారిని కొమారి మృగాంక్ (17), ఎండీ ఇబ్రహీం (20)గా గుర్తించారు.