MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ (ED) కార్యాలయం లోపలికి వెళ్లారు. పిడికిలి బిగించి మనదే విజయం అనే సంకేతం ఇస్తూ కవిత కార్యాలయంలోకి వెళ్లారు. కాగా, కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు తుగ్లక్రోడ్డులోని నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో కవిత భేటీ అయ్యారు.
#WATCH | Delhi: BRS MLC K Kavitha arrives at the ED office in connection with the Delhi liquor policy case. pic.twitter.com/T9YWhk7mtQ
— ANI (@ANI) March 11, 2023
#WATCH | Delhi: BRS MLC K Kavitha left from the residence of her father, Telangana CM K Chandrashekar Rao, for the ED office amid a gathering of party supporters.
(Source: K Kavitha office) pic.twitter.com/rgBt0rNwIu
— ANI (@ANI) March 11, 2023
మరోవైపు ఎమ్మెల్సీ కవితకు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. కవిత వైపే ధర్మం ఉందంటూ.. బీజేపీ కుట్రకు ప్రజలు సరైన జవాబు చెబుతారంటూ సోషల్ మీడియాలో సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇక హైదరాబాద్లో కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిసాయి. బీజేపీలో చేరక ముందు, చేరిన తర్వాత అంటూ సీబీఐ, ఈడీలను ఉపయోగించి చేస్తున్న బెదిరింపు రాజకీయాలను ఎత్తిచూపారు.
Delhi | BRS MLC K Kavitha arrives at the ED office in connection with the Delhi liquor policy case. pic.twitter.com/BQAwhl5zwv
— ANI (@ANI) March 11, 2023
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా (Jyothi raditya Sindiya), అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himantha biswa sharma), పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu Adikari), ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే ఐటీ, సీబీఐ రైడ్స్కు ముందు, తర్వాత రంగు మారినట్లు చూపించారు. తెలంగాణలో కవిత మాత్రం రైడ్స్కు ముందు, తర్వాత ఒకేలా ఉన్నారని.. అసలైన రంగులు వెలవంటూ పేర్కొన్నారు. చివర్లో బైబై మోదీ (#Bye Bye Modi) అంటూ హ్యాష్ టాగ్తో పోస్టర్లను అంటించారు. ఇప్పుడీ పోస్టర్లు నగరంలో ఆసక్తికరంగా మారాయి.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ కవితకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా? లేదు కదా. ఇది కూడా అంతే. కవితమ్మా మీరు ధైర్యంగా ఉండండి. మీ వెంట మేమున్నాం. యావత్ తెలంగాణ ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలు ఉన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులమైన మేమందరం.. మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉన్నాం.. భవిష్యత్లోనూ ఉంటాం. ధర్మం మీ వైపు ఉంది. అంతిమ విజయం మీదే.. మనదే’ అంటూ మంత్రి వేముల ట్వీట్ చేశారు.
Kavithamma @RaoKavitha Be brave
In the process of hunting mad dogs, We are bitten. Do we stop hunting?
We the members of KCR's family, especially the people of Nizamabad district,are with you in your righteous struggle.Dharma is on your side. Ultimate victory is yours & ours
— Vemula Prashanth Reddy (@VPR_BRS) March 11, 2023
కాగా, ఈ నెల 9నే విచారణకు రావాలని కవితకు సమన్లు జారీచేసినప్పటికీ ముందే ఖరారైన కార్యక్రమాల దృష్ట్యా మరో రోజు హాజరవుతానని, చట్టాల పట్ల తనకు గౌరవం ఉన్నదని ఆమె ఈడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ కవిత.. ఈ దీక్ష అనంతరం విచారణకు హాజరవుతానని ఈడీకి తెలిపారు.