జగిత్యాల: రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు రూ.5 లక్షలతో నిర్మాణం చేపడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు. ఆరు గ్యారంటీలో ఇంటి నిర్మాణాన్ని పేర్కొన్నామని, దానికి దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తిచేశామని తెలిపారు. జగిత్యాల పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని, అందులో ఎలాంటి సందేహం వద్దన్నారు. పింఛన్లను పెంచడంతోపాటు గృహలక్ష్మిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. అర్హులందరికీ పథకాలు అందుతాయని వెల్లడించారు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గ్రామ పంచాయతీల నిధులు వస్తాయని స్పష్టం చేశారు. మత్స్యకారుల సహకార సంఘానికి చేపనారు కోసం నేరుగా వారి ఖాతలో డబ్బులు వేసేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు.