హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): అసాధ్యం అనుకున్న తెలంగాణను.. సుసాధ్యం చేసిన కారణజన్ముడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. ఆదివారం శాసనమండలిలో ‘తెలంగాణ ఆవిర్భావ చరిత్ర- తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానం’పై జరిగిన స్వల్పకాలిక చర్చలో దేశపతి ప్రసంగించారు. ఉద్యమంలో కాలిమడిమ తిప్పితే రాళ్లతో కొట్టండి అని ధైర్యంగా చెప్పిన నేత కేసీఆర్ అని కొనియాడారు. సరైన వ్యూహంతో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడిపించినట్టు తెలిపారు. స్వ రాష్ట్రంలో నియామకాలతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని, గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి జరిగాయని, అభివృద్ధి వికేంద్రీకరణ చోటుచేసుకొన్నదని వివరించారు.
రైతుబంధు, దళితబంధుతో ఆత్మవిశ్వాసం పెరిగింది: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ బంధు పథకాలతో ఆయా వర్గా ల్లో ఆత్మైస్థెర్యం పెరిగిందని కాంగ్రెస్ ఎ మ్మెల్యే జీవన్రెడ్డి అభినందించారు. తొమ్మిదేండ్ల కాలంలో విద్యుత్తు, వ్యవసాయం, సాగునీటి వసతుల కల్పనలో ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఆయా రంగాల అభివృద్ధికి దో హదం చేశాయని కొనియాడారు. రైతులకు అమలు చేస్తున్న మా దిరిగానే రైతుకూలీలకు బీమా వర్తింపజేయాలని కోరారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఎం కేసీఆర్ సాంకేతిక నిపుణుడు : మండలి చీఫ్ విప్ భానుప్రసాద్
కేసీఆర్ ఉద్యమ నిర్మాణం నుంచి తెలంగాణ సాధన వరకు సాంకేతిక నిపుణుడిగా వ్యవహరించారని మండ లి చీఫ్ విప్ భానుప్రసాద్ పేర్కొన్నా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాం కాలేజీ విద్యార్థులపై పోలీసుల దాడులు జరిగిన నాడు అధికార కాం గ్రెస్లో ఉండి వ్యతిరేకించినట్టు చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రా జెక్టులు కట్టకుండా కాల్వలు తవ్వాయని, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు.
2014 తర్వాతే తెలంగాణ అభివృద్ధి: టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
2014 తర్వాతే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి సాధించిందని టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, సాగునీటి వసతులు, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యం అభివృద్ధి చెందాయని చెప్పారు. గురుకుల పాఠశాలలతో పేదలకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు.
భావోద్వేగాలను అధిగమించిన కేసీఆర్: ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి
తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి సమైక్య పాలకులు చేసిన కు ట్రలను కేసీఆర్ విజయవంతంగా ఎదుర్కొన్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. నాటి ఉద్యమ ప్రారంభం నుంచి తెలంగాణ ఆవిర్భా వం వరకు కేసీఆర్కు తోడుగా నిలిచిన వారిలో ఒకడిగా ఉన్నందుకు ఆనందంగా ఉన్నదని చెప్పారు. కేసీఆర్ దేశభవిష్యత్తు ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ సారథ్యంలో పనిచేయడం గర్వంగా ఉంది: పెద్ది సుదర్శన్రెడ్డి
తెలంగాణ ఉద్యమం మొదలు రాష్ట్ర ఆవిర్భావం నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడం చాలా గర్వంగా ఉన్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. గొప్ప విజనరీ నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. సమగ్ర అభివృద్ధి అంశంపై అసెంబ్లీలో ఆదివారం కొనసాగిన చర్చలోమాట్లాడారు. మొక్కవోని పోరాటంతో, అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి కేసీఆర్ తెలంగాణను సాధించారని వివరించారు. సాధించిన తెలంగాణను అంతే పట్టుదలతో తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.