అలంపూర్, ఫిబ్రవరి 8: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, నిలదీయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. ఆదివారం గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్ల దందా కొనసాగుతున్నదని, ఫలితంగా అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయినట్టు చెప్పారు. కళ్లబొళ్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను అంతమొందిస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోకుండా బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.