నర్సాపూర్,డిసెంబర్24 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి(MLA Sunithalakshmareddy) ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వరుడి కృపా కటాక్షాలతో ఎమ్మెల్యేగా గెలుపొందానని తెలిపారు. ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆ ఏడుకొండల స్వామిని కోరుకున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు సంతోష్రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.