యాదగిరిగుట్ట రూరల్, జూలై 13: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. సిందూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేశారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకుఅర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. నిత్యపూజలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. స్వామి వారి నిత్యకల్యాణాన్ని బాలాలయ మండపంలో వైభవంగా నిర్వహించారు. శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. మహామండ పంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం అలంకా ర జోడు సేవోత్సవాన్ని నిర్వహించారు.
దేవనాయక్ స్వామి వారి హుండీ లెక్కింపు
యాదగిరిగుట్ట మండలం దేవనాయక్ స్వామి వారి ఆలయ హుండీని మంగళవారం దేవాదాయ-ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీన హుండీకి సీలు వేసిన అధికారులు జూలై 13వ తేదీన లెక్కించగా మొత్తం రూ.1,26,846 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. దేవాదాయశాఖ భువనగిరి డివిజన్ పరిశీలకురాలు సుమతి, ఆలయ అర్చకులు బీమానాయక్ పర్యవేక్షణలో హుండీని లెక్కించారు.
మత్స్యాద్రి ఆలయంలో టెండర్లు వాయిదా
వలిగొండ, జూలై13: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి శ్రీలక్ష్మీ నర సింహస్వామి దేవస్థానం కొండపై మంగళవారం నిర్వహించిన దుకాణాల బహిరంగ వేలంలో సరై న పాట రాకపోవడంతో టెండర్లు, బహిరంగ వే లం పాటను వాయిదా వేసినట్లు దేవాదాయ ధర్మదాయశాఖ పర్యవేక్షణ అధికారి అన్నారావు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.