జగిత్యాల : రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీల(RMPs) సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని జగిత్యాల అర్బన్ రూరల్ మండలం ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎంపీ, పీఎంపీ సంఘం భవనానికి 10 గుంటల స్థలం కేటాయిం చామన్నారు. గ్రామీణ ప్రాత వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బుదారపు జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు కొండబత్తిని గణేష్, సెక్రటరీ కోల మహేందర్, ట్రెజరర్ శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ గోపి, కార్యవర్గ సభ్యులు మోహన్, బి.రాజేష్ ,రాజారాం, ఎండీ అబ్దుల్లా, భూమ రాజం, టి.గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.