కరీంనగర్ : చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులా మారి పొలం పనుల్లో బిజీబిజీగా గడిపారు. బుధవారం గంగాధర మండలం లింగంపల్లిలో పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. తాను కూడా పొలంలో దిగి కూలీలకు నారు పంచారు. పాటలు పాడుతూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ నాట్లు వేస్తున్న మహిళలను అభినందించారు.
ప్రభుత్వ పథకాలపై పాటలు పాడుతూ పనులు చేయడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మహిళలతో మాట్లాడుతూ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వివక్షతో ఉందని మూడు గంటల కరెంట్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి ని ఓడించి తీరాలని సూచించారు. తమకు కలిసి పొలంలో పని చేయడం పట్ల వ్యవసాయ కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.