హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాలను మలుపు తిప్పే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. దళిత బంధు పథకంతో దేశంలో దళిత జనోద్ధరణకు సీఎం కేసీఆర్ కొత్తదారి చూపారని అన్నారు. పైనుంచి కిందికి పారే సహజ లక్షణమున్న నీటి ప్రవాహ దశను కాళేశ్వరంతో మార్చి కేసీఆర్ అపరభగీరథుడు అయ్యారని కీర్తించారు.
‘తెలంగాణలో మూడు కాలాలతోపాటు మరో నీళ్ల కాలం వచ్చింది. రైతుబంధు, రైతు బీమాతో రైతు కుటుంబాలు కేసీఆర్ను దీవిస్తున్నాయి. నాడు ఒకడుగా మొదలై నేడు కోట్లమంది వెంటరాగా.. చేగువేరాలెక బయలు దేరిండు. నీటికి నడక నేర్పి మన బతుకులను తీర్చిదిద్దిండు.’ అని వ్యాఖ్యానించారు.