వైరా టౌన్, సెప్టెంబర్ 27: నమ్మిన వారికి సీఎం కేసీఆర్ ఏదో రకంగా న్యాయం చేస్తారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అ న్నారు. ఈ సారి తనకు బీఆర్ఎస్ టికెట్ రాలేదనే బాధ లేదని తెలిపారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనకు న్యాయం చేస్తారనే విశ్వా సం ఉన్నదని అన్నారు.
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ 30న ఖమ్మం జిల్లా కొణిజర్ల మం డలం అంజనాపురం లో ఆయిల్పాం ఫ్యా క్టరీ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో బుధవారం వైరాలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యేగా మదన్లాల్ గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు.