ఆదిలాబాద్ : జిల్లలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులతో ప్రతి నిత్యం సమీక్ష సమావేశాలు చేపడుతూనే.. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై నిరంతరం సూచనలు చేస్తున్నారు.
అందులో భాగంగానే రిమ్స్ ప్రధాన దవాఖానలోని కొవిడ్ వార్డును శుక్రవారం పరిశీలించారు. కొవిడ్ వార్డును స్వయంగా పరిశీలించి బాధితుల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. కరోనా సోకిన వారు ఎటువంటి అధైర్యానికి లోను కాకుండా వైద్యుల సూచనల మేరకు నడుచుకోవాలని సూచించారు.
బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బాధితులకు అందిస్తున్న వైద్య చికిత్సలు, ప్రస్తుతం కోవిడ్ వార్డులో చికిత్సలు పొందుతున్న వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ బృందం
22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్