యాదాద్రి భువనగిరి : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి జులుం ప్రదర్శించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎదుటనే రభస చేశారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి మంత్రి చేతిలో నుంచి మైకు లాగేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు. గతంలో కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మున్సిపల్ సమావేశంలో దురుసుగా ప్రవర్తించారు. రాజగోపాల్ రెడ్డి వైఖరి పట్ల స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పిల్లలతో కలిసి ఈత కొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం