నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల కడుపు నింపేందుకు సీఎం కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 20,129 రేషన్ కార్డులు మంజూరయ్యాయని, నిర్మల్ జిల్లాలో కొత్తగా 5,851 మంది అర్హులైన లబ్ధిదారుల ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయనున్నట్లు వెల్లడించారు.