దుబ్బాక, ఫిబ్రవరి 25: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అనుచరులు నిత్యం ఏదో రకమైన వివాదాలకు తెరలేపుతూ ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అశాంతిని సృష్టిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు తగులుతూ అల్లర్లకు దిగుతున్నారు. శనివారం ఎమ్మెల్యే స్వగ్రామం బొప్పాపూర్లో బీఆర్ఎస్ జెండావిష్కరణ కార్యక్రమంలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే అనుచరులు హంగామా సృష్టించారు. గ్రామంలో జెండావిష్కరణ కార్యక్రమంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎంపీ ప్రభాకర్రెడ్డితో బీజేపీ నాయకులు గొడవ పడి ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులపై రాళ్ల వర్షం కురిపించారు.
ఈ ఘటనలో పోతారెడ్డిపేట రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ కుమ్మరి బాగులు తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను దవాఖానకు తరలించి వైద్యం అందించారు. అంతకుముందు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పా టు చేస్తుంటే బీజేపీ నాయకులు కావాల ని అడ్డుకున్నా రు. గాయపడ్డ బాగులును మెదక్ ఎంపీ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు అభివృద్ధి చేయడం చేతకాదని, అభివృద్ధి చేసేవాళ్లను అడ్డుకోవడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో బీజేపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇక మీదట బొప్పాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ విషయంలో ఆరుగురు బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్టు భూంపల్లి పోలీసులు తెలిపారు.