హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్కుమార్, చల్లా వెంకట్రాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియటంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్టు ప్రకటించి, వారికి ఎన్నిక ధ్రువపత్రాలు అందజేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, విప్ శంభీపూర్ రాజు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బేతి సుభాష్రెడ్డి, మాధవరం కృష్ణారావు, అబ్రహాం, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అనంతరం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి మంత్రుల నివాస సముదాయంలో మంత్రి నిరంజన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో నవీన్కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రాంరెడ్డి గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును ప్రగతిభవన్లో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.