హైదరాబాద్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పితృ వియోగం కలిగింది. సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి(92) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. రాజిరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పెద్ది రాజిరెడ్డి మృతి పట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు స్వగ్రామమైన నల్లబెల్లి గ్రామంలో తమ తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పెద్ది సుదర్శన్ తెలిపారు.